కృష్ణ
హైందవ సంస్కృతి చాటిచెప్పాలన్నదే టిటిడి లక్ష్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 16 April 2016
జగ్గయ్యపేట రూరల్, ఏప్రిల్ 15: మండలంలోని ముక్త్యాల దళితవాడలో ఉన్న శ్రీకోదండ రామస్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన స్వామి వారి కంకణాలు, పసుపు కుంకుమ అక్షింతలను టిటిడి ప్రచార మండలి సభ్యుడు వల్లవరపు వెంకటబాబు శుక్రవారం ఉదయం ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన హింధూ ధర్మం, హైందవ సంస్కృతిని వాడవాడలా చాటి చెప్పాలన్న లక్ష్యంతో ముక్త్యాల గ్రామంలోని దళితవాడలో రామమందిరాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ శ్రీవారి సేవకులుగా మన ధర్మాన్ని సంస్కృతిని మానవతా విలువలను పిల్లలకు కూడా నేర్పించాలని వారిని ఆధ్యాత్మిక భావంతో పెంచాలని కోరారు.