కృష్ణ

మంచినీటి కోసం గ్రామస్థుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృత్తివెన్ను, ఏప్రిల్ 15: ప్రజలకు మంచినీరు అందించాలని తెలుగు తమ్ముళ్ళు శుక్రవారం 216ఎ జాతీయ రహదారిపై అండర్ టనె్నల్ వద్ద ధర్నాకు దిగారు. గరిసిపూడి ఎంపిటిసి నాగిడి నాగార్జున ఆధ్వర్యంలో గరిసిపూడి గ్రామస్థులంతా రోడ్డుపై బైఠాయించారు. నాటు పడవలను రోడ్డుకు అడ్డంగా పెట్టి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారు. రెండు పంటలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రధాన పంట కాలువకు మూడు సార్లు మంచినీటి అవసరాల కోసం నీరు వదిలినా దిగువ ప్రాంత ప్రజలకు చుక్కనీరు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న డిసి చైర్మన్ నెక్కంటి విజయ భాస్కరరావు, ఎంపిపి వలవల సత్యనారాయణ, జడ్‌పిటిసి ఒడుగు తులసీరావు ఆ ప్రాంతానికి చెందిన నాగార్జునను బుజ్జగించడానికి ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ ఫోన్‌లో మాట్లాడి హామీ ఇవ్వటంతో ఆందోళనను విరమించారు.