కృష్ణ

రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంచికచర్ల, ఏప్రిల్ 15: కృష్ణా పుష్కరాల ప్రత్యేక నిధులతో చేపట్టనున్న రహదారుల నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు. కోటి 20లక్షలతో మున్నలూరు, కోటి రూపాయలతో కునికినపాడులో రహదారి నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేసి త్వరితగతిన రోడ్డు నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. కృష్ణా పుష్కరాలకు విచ్చేసే యాత్రికులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక నిధులతో వౌళిక వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో పుష్కర ఘాట్‌లను అభివృద్ధి పర్చడంతో రహదారుల నిర్మాణంకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమల్లో జడ్‌పిటిసి కోగంటి బాబు, ఎంపిపి వేల్పుల ప్రశాంతి, ఎఎంసి చైర్మన్ నన్నపనేని లక్ష్మీనారాయణ, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు అల్లాడి కోటేశ్వరరావు, ఎస్‌సి సెల్ నాయకుడు వేల్పుల రమేష్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు చలంచర్ల మరియమ్మ, సూర్యదేవర శ్రీనివాసరావు,ఎంపిటిసి సభ్యురాలు మాదాసు కాంతమ్మ, జడ్‌పి కోఆప్షన్ సభ్యుడు షేక్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.