కృష్ణ

త్వరితగతిన ఫ్లైఓవర్ నిర్మాణానికి పనివారిని పెంచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 17: దుర్గాఫ్లైఓవర్ నిర్మాణ పనులకు ఎక్కువ సంఖ్యలో పనివారిని తరలించి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బాబు ఎ అన్నారు. స్థానిక దుర్గా ఫ్లైఓవర్ పనుల ప్రగతిని కలెక్టర్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గా ఫ్లైఓవర్‌ను పుష్కరాల సమయానికి వినియోగంలోకి తేచ్చేందుకు పూర్తి స్థాయిలో నిరంతరం పనులు కొనసాగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసం అవసరమైతే గుజరాత్ రాష్ట్రం నుండి 300 మంది ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో అనుభవం ఉన్న పనివారిని తక్షణమే రప్పించాలని ఆయన సూచించారు. వేసవి వల్ల మధ్యాహ్న సమయంలో పనులు కొనసాగించలేక పోతే రాత్రి సమయాల్లో పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. పనులు అనుకున్న వేగంతో కొనసాగించలేకపోతే సమస్యలు ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా పలు స్థాయిల్లో పనులు కాల నిర్ణయం ప్రకారం జరగకపోవడాన్ని కలెక్టర్ పరిశీలనలో వెల్లడైంది. దీనిపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ పనుల వేగాన్ని మరింతగా పెంచాలని ఆయన సూచించారు.