కృష్ణ

3300 మందికి ముద్రా రుణాల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, జూన్ 17: గుడివాడ పట్టణంలో ఇప్పటి వరకు 3,300 మంది అర్హులైన లబ్ధిదారులకు ముద్రా రుణాలను పంపిణీ చేసినట్టు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామినేని వెంకటకృష్ణ చెప్పారు. శనివారం స్థానిక గోపాలరావుపేటలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సబ్‌కా సాత్- సబ్‌కా వికాస్, మోదీ ఫెస్ట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 115 పథకాలను కరపత్రాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. కేంద్ర పథకాలను, ప్రజలను దేశంలోని పలు రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఇంటింటికీ వెళ్ళి మోదీకి అండగా నిలవాలని ప్రజలను కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుత్తికొండ శ్రీరాజబాబు, కార్యదర్శి ఆలమూరి మురళీకృష్ణ, నియోజకవర్గ అధ్యక్షుడు సూరే గాంధీ, మహిళా మోర్చా నాయకురాలు శలంకాయల లీలాకుమారి, బిజెపి నాయకులు బొప్పన జక్రయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.