కృష్ణ

విశాఖపట్నం - బెంగళూరు ఎయిరిండియా విమానం రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, సెప్టెంబర్ 23: విశాఖపట్నం నుండి గన్నవరం మీదుగా బెంగళూరు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం సాంకేతిక లోపం కారణంగా శనివారం రద్దయింది. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చి 8.25 గంటలకు బెంగళూరు వెళ్తుంది. కాగా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విశాఖపట్నంలోనే నిల్చిపోయింది. ఈ నేపథ్యంలో బెంగళూరు వెళ్లాల్సిన 46 మంది ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. మధ్యాహ్నం వరకు ఎయిర్‌పోర్టులోనే ప్రయాణికులు వేచి ఉన్నారు. ఎయిరిండియా అధికార్లు సర్వీసు రద్దయినట్లు ప్రకటించారు. ప్రయాణికులు అధికార్లపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. వీరిని స్పైస్ జెట్ విమానంలో బెంగళూరుకు తరలించారు.

ఇంటర్ కాలేజీ కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు పూర్తి
జగ్గయ్యపేట, సెప్టెంబర్ 23: పట్టణంలో ఈ నెల 25 నుంచి జరగనున్న ఇంటర్ కాలేజీ కబడ్డీ టోర్నమెంట్‌లకు ఏర్పాట్లు పూర్తయ్యాయని నిర్వాహకులు కర్లపాటి వెంకట శ్రీనివాసరావు, పిఇటి గంటా వెంకటేశ్వరరావులు తెలిపారు. పట్టణంలోని క్రీడా ప్రాంగణాన్ని వారు శనివారం పరిశీలించారు. నెహ్రూ యువ కేంద్రం విజయవాడ సహకారంతో తొలిసారిగా అంతర్ కళాశాలల పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు జి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.