కృష్ణ

వైభవంగా తిరుమలగిరి వెంకన్న రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, ఏప్రిల్ 24: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. అర్చకుడు తిరునగరి రామకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల అనంతరం స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన రథంపై వేంచేపు చేసి రథోత్సవాన్ని నిర్వహించారు. సహాయ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణ అధికారి డి శ్రీరాంవరప్రసాదరావు రథోత్సవాన్ని ప్రారంభించారు. చిల్లకల్లు ఎస్‌ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఉత్సవాల్లో నాల్గవ రోజైన ఆదివారం సప్తముని పూజా సదశ్యం నిర్వహించారు. పరాంకుశం వాసుదేవాచార్యులు సదశ్యం విశిష్టతను భక్తులకు తెలియజేశారు.