కృష్ణ

జనం మెచ్చిన నేతను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: వచ్చే ఎన్నికలలో మైలవరం బరిలో ఎవరు పోటీలో ఉన్నా గెలిచేది తానేనని, ఎంత మంది కృష్ణులొచ్చినా తన విజయాన్ని ఆపలేరని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. జలవనరుల శాఖ కార్యాలయంలో శుక్రవారం ఆయన మైలవరం నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడారు. తనను ఓడించేందుకు వైసీపీ అనేక కుట్రలు చేస్తోందని ఐనప్పటికీ తనను ఓడించటం వారి వల్ల కాదన్నారు. ప్రజల అభిమానం ఉన్నంత వరకూ తన విజయాన్ని ఎంతమంది కృష్ణులొచ్చినా ఆపలేరని ఆయన పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గానికి ఎల్లలు తెలియని వారు డబ్బు మదంతో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ సమస్యలపై వారికి ఏ మాత్రం అవగాహన లేదని అటువంటి వారు తాను ఎటువంటి అభివృద్ధి చేయలేదని మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఎందరో నేతలు వస్తారు... పోతారు... ఇక్కడే ఉండేది... అభివృద్ధికి పాటుపడేది తానేనని మంత్రి ఉమ స్పష్టం చేశారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్భ్రావృద్ధికి చంద్రబాబు నేతృత్వంతో తాము చేస్తున్న కృషికి ఫలితాలొస్తున్నాయన్నారు. రాష్ట్రానికి దిశ-దశ చంద్రబాబేనన్నారు. తెలుగు ప్రజలకు గుర్తుండేలా ఈ నెల 27 నుండి మూడు రోజుల పాటు 37వ మహానాడును నిర్వహించనున్నట్లు తెలిపారు. మైలవరం నియోజకవర్గంతోపాటు జిల్లాలోని ప్రతి కార్యకర్త ఒక సైనికుడి మాదిరిగా పని చేసి మహానాడును విజయవంతం చేయాలన్నారు.