కృష్ణ

హోదా కోసం 22న దుర్గమ్మకు బోనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఈనెల 22వ తేదీన విజయవాడ కనకదుర్గమ్మకు బోనాలు సమర్పించనున్నారు. ఇందులో భాగంగా భాగ్యనగర్ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర బోనాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతినిధులు సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరు కావాలని సీఎంను ప్రతినిధులు ఆహ్వానించారు. దుర్గమ్మకు తొలిసారిగా బంగారు బోనం, పట్టువస్త్రాల సమర్పణ, కృష్ణానదిలో గంగతెప్ప పూజ నిర్వహించాలని నిర్ణయించారు. కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య, ప్రధాన కార్యదర్శి బల్వంత్‌యాదవ్ తదితరులు సీఎంను కలిసి బోనాలకు ఆహ్వానించారు.