కృష్ణ

విలువలకు నిలువుటద్దం వాజపేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి విలువలకు నిలువెత్తు నిదర్శనమని పలువురు భారతీయ జనతా పార్టీ నేతలు పేర్కొన్నారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతో బాధ పడుతున్న వాజపేయి గురువారం మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలతో పాటు ఇతర రాజకీయ పార్టీల నాయకులు తమ ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియచేశారు. మచిలీపట్నం కోనేరుసెంటరులో పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. సభలో పాల్గొన్న వక్తలంతా వాజపేయి గుణగణాలను వివరించారు. భ్రష్ఠు పట్టిన రాజకీయాలకు వాజపేయి సరికొత్త నిర్వచనంగా నిలిచారన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, దేశ ప్రధానిగా దేశ ప్రజలకు ఆయన చేసిన సేవలు నిరుపమానమన్నారు. అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డును వాజపేయి అందుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆలపాటి లక్ష్మీనారాయణ, బీజేపీ లీగల్ సెల్ జిల్లా చైర్మన్ సోడిశెట్టి బాలాజీ, బందరు పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పంతం వెంకట గజేంద్రరావు, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కూనపరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.