కృష్ణ

గ్రామస్థాయి నుండి బిజెపిని బలోపేతం చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 8: గ్రామస్థాయి నుండి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి అన్నారు. స్థానిక రోటరీ హాలులో ఆదివారం సాయంత్రం బందరు నియోజకవర్గ బిజెపి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కుమారస్వామి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో బిజెపిని శక్తిమంతమైన పార్టీగా తీర్చిదిద్దాలన్నారు. పార్టీ బలోపేతమైతే రాబోయే ఎన్నికల్లో పొత్తు ఉన్నా, లేకపోయినా అధిక స్థానాలను కైవసం చేసుకోవచ్చన్నారు. కార్యకర్తలు పదవీ బాధ్యతలతో సరిపెట్టుకోకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలన్నారు. వార్డు, గ్రామస్థాయిలో ప్రజాసమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి, రాష్ట్ర కమిటీ సభ్యులు వల్లూరు శ్రీమన్నారాయణ, శామ్యూల్, కిసాన్ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల అంజిబాబు, రేగళ్ళ రఘునాథరెడ్డి, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, పంతం వెంకట గజేంద్రరావు, చిలంకుర్తి పృధ్వీప్రసన్న, కూనపరెడ్డి శ్రీనివాసరావు, వైవిఆర్ పాండురంగారావు, కరెడ్ల సుశీల, కంభాల శంకరబాబు, నల్లారి మురళీకృష్ణ పాల్గొన్నారు.