కృష్ణ
రేపు గుంటూరుకు రాజ్నాథ్ సింగ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 15 October 2018
విజయవాడ: కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెల 16న గుంటూరు రానున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మీడియా సెల్ ఇన్చార్జి తురగా నాగభూషణం ఒక ప్రకటనలో తెలిపారు. నూతనంగా నిర్మించనున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయ భవనానికి ఆయన శిలాఫలకం ఆవిష్కరిస్తారని తెలిపారు. మరో ముఖ్యఅతిథిగా పార్లమెంట్ సభ్యుడు, జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు వినోద్ సోంకార్ కూడా హాజరుకానున్నారని తెలిపారు. కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షత వహిస్తారన్నారు. ఈసందర్భంగా గుంటూరు రెడ్డిపాలెం ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద జరగనున్న ఎస్సీ మోర్చా రాష్ట్ర నూతన అధ్యక్షుడు సునీల్ ప్రమాణ స్వీకారోత్సవ బహిరంగ సభలో వీరు పాల్గొంటారని నాగభూషణం వివరించారు.