కృష్ణ

మీ కష్టాలను మా దృష్టికి తీసుకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: సమస్య ఏదైనా దాన్ని పరిష్కరించేందుకు పోలీసు శాఖ అన్ని వేళలా సంసిద్ధంగా ఉంటుందని జిల్లా పోలీసు సూ పరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్‌లో ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుం డి అర్జీలు తీసుకుని పరిష్కార మా ర్గాలు చూపారు. ఈ సందర్భంగా ఎ స్పీ త్రిపాఠి మాట్లాడుతూ ప్రజలు త మ కష్టాన్ని నిర్భయంగా తమ దృష్టికి తీసుకు వచ్చి పరిష్కారం పొ ందాలన్నారు. ప్రజాదివస్‌లో ద్వారా అనేక సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేని వి ధంగా ప్రజాదివస్‌లో ప్రజల నుండి విశేష స్పందన వస్తోందన్నారు. ప్ర జలు తమ సమస్యలను నేరుగా ప్రజాదివస్ దృష్టికి తీసుకు వస్తున్నారన్నా రు. ప్రజాదివస్‌లో వచ్చే అర్జీల పరిష్కార చర్యలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. క్షేత్ర స్థాయిలో నిజా ని జాలు తెలుసుకుని అర్జీదారులకు తగు న్యాయం చేస్తున్నట్లు ఎస్పీ త్రిపాఠి తెలిపారు.
ఆకట్టుకున్న చిన్నారుల భరతనాట్యం
మండవల్లి, అక్టోబర్ 15: మండల కేంద్రం మండవల్లిలో దేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి అభినవ నాట్యమండలి అకాడమీ నాట్యచారిణి కె జ్యోతి ఆధ్వర్యంలో కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలో చిన్నారులు విశేష ప్రతిభ కనబరిచారు. చిన్నారులు అదిగో అల్లదిగో.., హరిగిరి నందిని.., దండాలు దండాలు అమ్మోరు తల్లో.., మూషిక వాహన.. వంటి శాస్ర్తియ సంగీతానికి అనుగుణంగా చేసిన నృత్యం పలువురుని ఆకట్టుకుంది. ఆలయ నిర్వహకులు, భక్తులు నాట్యచారిణి జ్యోతి, నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు బహుమతులను అందజేశారు.
శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవార్లు
కోడూరు, అక్టోబర్ 15: వాడవాడలా జరుగుతున్న దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కోడూరు శ్రీ గంగానమ్మతల్లి, విశ్వనాధపల్లి శ్రీ నాంచారమ్మ తల్లి, వేణుగోపాలపురం శ్రీ అంబికాదేవి, కోడూరు సంత మా ర్కెట్ పక్కన ఉన్న శ్రీ కనకదుర్గ ఆలయంలోని అమ్మవార్లు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాలలో ప్రత్యేక పూ జలు, నైవేద్యాలు సమర్పించారు. విశ్వనాధపల్లి నాంచారమ్మతల్లి ఆలయ కార్యనిర్వహణాధికారి టివివి మోహనరావు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు విశేష కృషి చేస్తున్నారు.