కృష్ణ

అధికారుల పనితీరుపై సమీక్షిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని పనితీరును మెరుగుపర్చుకుని లక్ష్యాలను అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ శాఖల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్ పారా మీటర్స్‌లో ముందంజలో ఉందన్నారు. రానున్న రెండు నెలల్లో అధికార యంత్రాంగం అంతా ఎన్నికల విధుల్లో ఉన్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖాధికారులకు మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు. క్రమం తప్పకుండా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. వైద్యుల కొరతను అధిగమించేందుకు మార్గాలు అనే్వషించాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఐ రమేష్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణకుమారి, డీసీహెచ్‌ఎస్ డా. విజయలక్ష్మి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. జయకుమార్, ఆర్‌ఎంఓ డా. అల్లాడ శ్రీనివాసరావు, ఐసీడీఎస్ సీడీపీఓలు పాల్గొన్నారు.