కృష్ణ

బీసీలను వంచిస్తున్న చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: బడుగు బలహీన వర్గాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నయవంచనకు గురి చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రభుత్వ మాజీ విప్ పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదివారం ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనకు జిల్లా కేంద్రం మచిలీపట్నం నుండి వందలాది మంది తరలివెళ్లారు. పేర్ని నాని నాయకత్వంలో సుమారు 15 బస్సుల్లో వైసీపీ శ్రేణులతో పాటు బీసీలు భారీ సంఖ్యలో ఏలూరు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పేర్ని నాని ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దుమ్మెత్తి పోశారు. బీసీలకు తీరని అన్యాయం చేస్తున్న చంద్రబాబు గుణపాఠం చెప్పేందుకు ప్రతి ఒక్క బీసీ కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో దొంగ హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబుకు బీసీలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ నాయకత్వాన్ని బీసీలంతా కోరుకుంటున్నారన్నారు. బీసీల సంక్షేమానికి పెద్ద పీట వేసిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఒక్కరేనన్నారు. బీసీలకు దిశా నిర్ధేశం చేసేందుకు జగన్మోహనరెడ్డి ఏలూరులో బీసీ గర్జన నిర్వహిస్తున్నారని తెలిపారు. రానున్న జగన్ ప్రభుత్వంలో బీసీలకు అన్ని విధాలా న్యాయం జరిగి తీరుతుందని పేర్ని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా తదితరులు పాల్గొన్నారు.