కృష్ణ

భక్తులతో కిక్కిరిసిన ఆలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, మే 22: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిక్కిరిసింది. ఉదయం 6గంటల నుండి భక్తులు బారులుతీరి స్వామివారి నాగపుట్టలో పాలుపోసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కేశఖండనలు, చెవిపోగులు, ఒడుగులు, పాలపొంగళ్లు, తదితర మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ ఎ మధుసూదనరావు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. ఆలయ ప్రధాన అర్చకులు బద్దు పవన్‌కుమార్ శర్మ వివిధ రకాల పూజలను పర్యవేక్షించారు. కాగా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం 25న ఉదయం 9గంటల నుండి నిర్వహించనున్నట్లు చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఏసి ఎం శారదాకుమారి ఆదివారం తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖాధికారుల సమక్షంలో హుండీ లెక్కింపు జరుగుతుందని తెలిపారు.