కృష్ణ

చంద్రబాబు, ఉమ చిత్రపటాలకు పాలాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, : నిరుపేదల నివేశన స్థలాలకై ఉద్దేశించిన 78.22 ఎకరాల పూరగుట్టకు ప్రత్యేక జీఓ 318 ద్వారా ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి అనుమతులు తెచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చిత్రపటాలకు తెలుగు తమ్ముళ్ళు శుక్రవారం పాలాభిషేకం చేసి పండగ జరుపుకున్నారు. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్‌లో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన అనంతరం తెలుగు తమ్ముళ్ళు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. అనంతరం చంద్రబాబు, మంత్రి ఉమ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ విపక్ష నేతలు ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా మంత్రి ఉమ పట్టుదలతో పేదల కోసం జీఓను సాధించి విపక్షాల నోళ్ళు మూయించారన్నారు. నాడు తారకరామానగర్ ఎన్టీఆర్ చలవ అయితే నేడు పూరగుట్ట చంద్రబాబు, దేవినేని ఉమ చలవ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ గంజి కృష్ణారెడ్డి, ఎంపిపి లక్ష్మి, పట్టణ పార్టీ అధ్యక్షులు మల్లెల రాధాకృష్ణ, కార్యదర్శి బాలకృష్ణ, గొల్లపూడి వెంకటేశ్వరరావు, ఎంపిటిసి తులశి పాల్గొన్నారు.