కృష్ణ

నమ్మించి నట్టేట ముంచారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెడన: వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి తనను నమ్మించి మోసం చేశారని పెడన టికెట్ ఆశించి భంగపడ్డ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉప్పాల రాంప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా మనోవేదనకు గురవుతున్న రాంప్రసాద్ మంగళవారం రాత్రి తన అనుచర వర్గంతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన రాంప్రసాద్ అనుచురులు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున హాజరవ్వగా వారి సలహాలు సూచనలు తీసుకున్నారు. నమ్మించి మోసం చేసిన జగన్, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఫోటోలతోనే స్వతంత్ర అభ్యర్థిగా పెడన నుండి పోటీ చేస్తానని రాంప్రసాద్ స్పష్టం చేశారు. ఇందుకు అనుచవర్గంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తొలుత మాట్లాడిన ఉప్పాల రాంప్రసాద్ తనయుడు, యువజన విభాగం నాయకుడు రాము తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నమ్మించి మోసం చేసిందన్నారు. కోట్లాది రూపాయలను నష్టపోవటంతో పాటు వ్యాపారాలను కూడా అధికార పార్టీ నాయకులు మూసి వేయించారని, అయినప్పటికీ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశామన్నారు. తమకు రెబల్‌గా పోటీ చేసే ఆలోచన ఉందని, రాజశేఖరరెడ్డి, జగన్ ఫొటోలతోనే ఎన్నికల బరిలోకి దిగుతామన్నారు.