కృష్ణ

జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఏప్రిల్ 11వ తేదీన జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎఐసీసీ ఖరారు చేసింది. విజయవాడలోని మూడు నియోజకవర్గాలతో పాటు నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థులను ఖరారు చేయలేదు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా గొల్లు కృష్ణ, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా నరహరశెట్టి నరసింహారావును ఖరారు చేశారు. గొల్లు కృష్ణ గతంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్‌గా పని చేశారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఆయన ఈ విడత ఎన్నికల్లో బందరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారైన నరహరశెట్టి నరసింహారావు ప్రస్తుతం పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా సేవలు అందించారు.

నియోజకవర్గం అభ్యర్థి పేరు

మచిలీపట్నం - యండి దాదా సాహెబ్
గన్నవరం - సుంకర పద్మశ్రీ
జగ్గయ్యపేట - కర్ణాటి అప్పారావు
తిరువూరు - పరస రాజీవ్ రతన్
గుడివాడ - ఎస్ దత్తాత్రేయులు
కైకలూరు - నూతలపాటి పీటర్ పాల్ ప్రసాద్
అవనిగడ్డ - అందె శ్రీరామ్మూర్తి
పామర్రు - మొవ్వ మోహనరావు
పెనమలూరు - లాం తాంతియాకుమారి
మైలవరం - బొర్రా కిరణ్
నందిగామ - వేల్పుల పరమేశ్వరరావు