కృష్ణ
మైలవరంలో నవ నిర్మాణ దీక్ష ర్యాలీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 3 June 2016
మైలవరం : ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మైలవరంలో గురువారం నవ నిర్మాణ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పంచాయితీ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధులలో తిరిగి మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుంది. అక్కడ ఎంపిడిఓ వై హరిహరనాథ్ ఆధ్వర్యంలో నవ నిర్మాణ దీక్ష గురించి వివరించారు. అనంతరం అక్కడికి చేరుకున్న ఉద్యోగులు, పురప్రముఖులు, పార్టీ నేతలతో నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ ధనేకుల సాంబశివరావు, ఎంపిపి లక్ష్మి, సర్పంచ్ కృష్ణవేణి, ఉప సర్పంచ్ షహానా బేగం, వార్డు సభ్యులు, ఎంపిటిసిలు, రెవెన్యూ సిబ్బంది, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.