కృష్ణ

పడవ ప్రమాద బాధితులకు ముఖ్యమంత్రి పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్ జంక్షన్ : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో ఆదివారం జరిగిన పడవ ప్రమాదంలో బాపులపాడు మండలానికి చెందిన బాధితులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. మండలంలోని పెరికీడుకి చెందిన మద్దాల జోజి , గొరిపర్తి సుబ్రహ్మణ్యం, జంక్షన్‌కు చెందిన ఉంగరాల శ్రీను, నిడకుదురు శ్రీను, సలీం విహార యాత్రకు వెళ్ళారు. నదిలో పడవ ప్రమాదం జరగడంతో సలీం, శ్రీను మృతి చెందారు. మిగిలిన మగ్గురు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం బాధితులను సిఎం జగన్ పరామర్శించిన నేపథ్యంలో బాపులపాడు మండలానికి చెందిన వారిని కలిసి వారి యోగక్షేమాలు కనుగొన్నారు.