కృష్ణ

హైకోర్టు తరలింపు ఆలోచనను విరమించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, : ఆంధ్రప్రదేశ్ హైకోర్టును గుంటూరు జిల్లా నేలపాడు నుండి కర్నూలు జిల్లాకు తరలించాలన్న ఆలోచనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ రాష్ట్ర న్యాయవాదుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం మైలవరం న్యాయవాదులు విధులను బహిష్కరించి ఒక రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలలోని న్యాయవాదులకు ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యమైనది కాదన్నారు. ప్రభుత్వం ఈ అలోచనలను విరమించుకోవాలని సీనియర్ న్యాయవాది పివి శేషగిరిరావు డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసరావు, సాంబశివరావు, సభ్యులు కోటేశ్వరరావు, ఆంజనేయులు, విటి కిషోర్, బుద్ధారపు వెంకట్రావ్, రమేష్ బాబు, పివి సాంబశివరావు, శరత్ బాబు ఈదీక్షలో పాల్గొన్నారు.