కృష్ణ

పేటలో ఘనంగా ఘంటసాల విగ్రహ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట: పట్టణంలో ఆమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహాన్ని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను బుధవారం రాత్రి ఆవిష్కరించారు. పట్టణంలోని కోదాడ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని సామినేని ఆవిష్కరించి అనంతరం ప్రసంగిస్తు ఘంటసాల గానం అజరామమని, తెలుగుజాతి ఘంటసాల గానాన్ని మరువద్దని అన్నారు. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘంటసాల కళారాధన సేవాసమితిని అభినందించారు. ఈసందర్భంగా ప్రముఖ కవి సరికొండ నరసింహరాజు రచించిన వేకువచలమా పుస్తకాన్ని సామినేని ఉదయభాను ఆవిష్కరించారు. అనంతరం సామినేనికి కళారాధన సేవాసమితి నేతలు ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో షేక్ అబ్బాస్ ఆలీ, ఎం బాబ్జీ, శ్రీకృష్ణ, డాక్టర్ టీఎల్‌ఎన్ ఆచార్యులు, నేతలు తన్నీరు నాగేశ్వరరావు, సిహెచ్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.