కృష్ణ
గోదావరి జలాలకు చీమలవాగు యుటి వద్ద అధికారులు పూజలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 16 July 2016
గన్నవరం, జూలై 15: కొత్తగూడెం చీమలవాగు అండర్ టనె్నల్ వద్ద శుక్రవారం పోలవరం కాల్వ వద్ద గోదావరి జలాలను రాష్ట్ర జలవనరుల శాఖ అపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ళ గోపాలకృష్ణారావు ఆధ్వర్యంలో అధికార్లు పూజలు చేశారు. క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ శ్రీనివాసరావు, పోలవరం డిఈఈ జెవి సత్యకుమార్, నాగార్జునసాగర్ ఈఈ అర్జునరావు, ఎన్ఎస్పి చీఫ్ ఇంజనీర్ వీర్రాలు, ఎఈలు సరస్వతి, స్రమీతి విజేత కన్స్ట్రక్షన్స్ శ్రీనివాసరావు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆళ్ళ మాట్లాడుతూ పోలవరం జలాలలు ఆరు అడుగుల ఎత్తులో వస్తుందని ఈ ప్రవాహం మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, విఆర్వోలు ఎప్పటికప్పడు పర్యవేక్షించాలని ఆళ్ళ కోరారు.