కృష్ణ
ఎన్జీవో హోమ్ నిర్మాణానికి విరాళం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 26 August 2016
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఆగస్టు 25: ఏపి ఎన్జీవోస్ తూర్పు కృష్ణా జిల్లా శాఖ తలపెట్టిన ‘హోమ్’ నిర్మాణానికి మచిలీపట్నంలోని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు 130 మంది ఒకరోజు వేతనం లక్షా 31వేల 830 రూపాయలను చెక్కు రూపంలో ఏపి ఎన్జీవోస్ జిల్లా కార్యవర్గానికి గురువారం అందించారు. సిబ్బంది అందరూ సహృదయంతో అందించిన సహకారానికి జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు ఉల్లి కృష్ణ, దారపు శ్రీనివాస్, పివి సాయికుమార్, టౌన్ అధ్యక్షులు ఆకూరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు యువిఎస్ఆర్కె కుమార్, పి రాజశేఖర్, తదితరులు అభినందించారు. ఇదే స్ఫూర్తితో అన్ని శాఖల ఉద్యోగులు సహకరిస్తున్నారని వారు తెలిపారు.