కృష్ణ

అగ్ని ప్రమాదంలో వ్యక్తి సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, ఆగస్టు 29: మండల పరిధిలోని మల్లవోలు గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు. గ్రామానికి చెందిన మడమల గంగరాజు (35) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ మంచం మీద ఉంటున్నాడు. గంగరాజుతోపాటు అతని తల్లి వెంకట సుబ్బమ్మ ఉంటోంది. సోమవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా వీరు నివశిస్తున్న ఒంటి నిట్టాడి ఇల్లు దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో తల్లి సుబ్బమ్మ పొలం పనులకు వెళ్ళింది. గంగరాజు ఒక్కడే ఇంట్లో ఎటూ కదలలేని స్థితిలో ఉండటంతో అగ్నికి ఆహుతయ్యాడు. స్థానికులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. బందరు అగ్నిమాపక అధికారులు, గ్రామ సర్పంచ్ పర్ణం పెదబాబు హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్ళి మంటలను అర్పే ప్రయత్నం చేశారు. గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.