కృష్ణ

మూడు ప్రాథమిక పాఠశాలలు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, సెప్టెంబర్ 1: మైలవరం మండలంలో మూడు ప్రాథమిక పాఠశాలలు నూతనంగా మంజూరైనట్లు ఎంపిపి బాణావతు లక్ష్మి, జెడ్పీటిసి దొండపాటి రాము గురువారం విలేఖర్లకు తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ మండలంలోని చండ్రగూడెం శివారు సబ్జపాడు, వెల్వడం, చంద్రాల దళితవాడలో పాఠశాలలు మంజూరైనట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పాఠశాలల ఆవశ్యకతను గ్రామస్తులు తమ దృష్టికి తీసుకురాగా జిల్లా విద్యాశాఖాధికారితో సంప్రదించి మంజూరుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సబ్జపాడులో 8 సెంట్లు, చంద్రాలలో 4 సెంట్ల స్థలం ఇచ్చేందుకు అక్కడి ప్రజలు అంగీకరించారని, వెల్వడంలో పాత సీఎస్‌ఐ స్కూల్‌లో నూతన పాఠశాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. త్వరలోనే ఈ పాఠశాలలు ప్రారంభమవుతాయన్నారు. మండలంలో పలు పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను నూతనంగా మంజూరైన పాఠశాలల్లో నియమించనున్నట్లు తెలిపారు. ఎంఇఓ ఎల్ బాలు పాల్గొన్నారు.