కృష్ణ

పోయేవాళ్లతో కాంగ్రెస్‌కు నష్టం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, సెప్టెంబర్ 1: కాంగ్రెస్ పార్టీ నుండి సొంత గూటికి వెళ్లేవారి వల్ల ఎటువంటి నష్టం ఉండదని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. గురువారం గుడివాడ వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో చరిత్ర ఉందని, పార్టీ నుండి వెళ్ళే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. కృష్ణాజిల్లాలో పార్టీ మరింత బలోపేతం కానుందన్నారు. రాష్ట్రంలో దాదాపు 70కు పైగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పటిష్ఠంగా ఉందన్నారు. రాష్ట్ర విభజన బిల్లులో పొందుపర్చిన అంశాలన్నీ అమలు చేసేవరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తూనే ఉంటుందన్నారు. వైసీపితో పొత్తు అంశంపై విలేఖర్లు అడిగిన ప్రశ్నకు ఎన్నికల సమయంలో మాట్లాడుకోవాల్సిన అంశాలను ఇప్పుడు మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి మాజీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, పిసిసి కార్యదర్శి రుద్రరాజు, ఉపాధ్యక్షులు శిష్ట్లా దత్తాత్రేయులు, గానుగుల వీరనేతాజీబాబు, పట్టణ అధ్యక్షుడు వీరిశెట్టి వెంకట నరసింహారావు, నాయకులు కూరేటి శ్యామ్‌కుమార్, పట్టణ ప్రముఖుడు పల్లెబాట రాజా, వసంతవాడ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.