కృష్ణ
ప్రశాంతంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 22 March 2016
అవనిగడ్డ, మార్చి 21: పదవ తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలోని ఆరు మండలాలలోని 24 పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు పరీక్షలు వ్రాశారు. చల్లపల్లి ఎస్ఆర్వైఎస్పి జూనియర్ కళాశాలలో తొలి సారిగా పరీక్షా కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం 763 మంది పరీక్షలు వ్రాయాల్సి ఉండగా ఆరుగురు గైర్హాజరయ్యారు. 759 మంది తొలి రోజు తెలుగు, సంస్కృతం పరీక్ష వ్రాశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 259కి 259 మంది, సెయింట్ ఆన్ స్కూల్లో 244కి 242, కంపార్ట్మెంట్ కేంద్రంగా ఉన్న స్థానిక జడ్పి హైస్కూల్లో 17కి 15 మంది పరీక్ష వ్రాశారు.