కృష్ణ

రేపు రైతులతో కలెక్టర్ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి కొండూరు, సెప్టెంబర్ 25: జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన రైతలతో ఈ నెల 27న విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్ సుధారాణి ఆదివారం తెలిపారు. జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు సమంజసమైన ధర ఇవ్వనందుకు రైతులు రహదారి విస్తరణ పనులను అడ్డుకున్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు రైతులకు సరైన నష్టపరిహారం ఇప్పించేందుకు వారితో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు 27న వారితోనే సమావేశమై చర్చించి సమస్యను పరిష్కరించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశానికి భూములు కోల్పోయిన రైతులంతా తప్పక హాజరుకావాలని తహశీల్దార్ కోరారు.