కృష్ణ

దివి మెయిన్ కెనాల్‌లో మహిళ గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, సెప్టెంబర్ 29: స్థానిక దివి మెయిన్ కెనాల్‌లోని పాత వంతెనపై నుండి చేపలు పడుతూ ఉన్న దార్ల తిరుపాలు, కుమారి కాలుజారి కెనాల్‌లో పడిపోవటంతో గల్లంతవ్వగా తిరుపాలు సురక్షితంగా ఒడ్డుకు చేరాడు. ఒంగోలు నుండి భిక్షాటనకు వచ్చిన వీరు ఉదయం సమయంలో చేపలు పడుతుండటం అలవాటుగా మారింది. చేపలు పడుతూ కుమారి పడిపోవటంతో గమనించిన స్థానిక ఎస్టీ కాలనీకి చెందిన కందుల రమేష్ తాను కట్టుకున్న లుంగీని తిరుపాలుకు అందించి ఒడ్డుకు లాగారు. కుమారి మాత్రం నీటి ప్రవాహంలో గల్లంతైంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి కుమారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా తిరుపాలు, అతని సోదరుడు గురవయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స కోసం అవనిగడ్డ వైద్యశాలకు పంపారు.