కృష్ణ

స్కూల్ బస్సు నుండి జారిపడి విద్యార్థి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 17: ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు నుండి జారిపడి ఓ విద్యార్థి దుర్మరణం చెందిన సంఘటన బందరు మండలం గోకవరం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం పెడన మండలం నందమూరు గ్రామానికి చెందిన ఆర్‌ఎంపి వైద్యులు సిహెచ్ శివకుమార్ కుమారుడు చైతన్య(13) గోకవరం గ్రామంలోని భాష్యం లిటిల్ చాంప్స్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం ఉదయం 8.30 గంటలకు ఇంటి నుండి స్కూల్ బస్సులో బయలుదేరి వెళ్ళాడు. గోకవరం వద్ద ప్రమాదవశాత్తు రన్నింగ్‌లో ఉన్న స్కూల్ బస్సు నుండి చైతన్య జారి పడ్డాడు. దీన్ని గమనించని బస్సు డ్రైవర్ చైతన్య మీదుగా బస్సును పోనివ్వటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఘనటా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఈ ఘటనపై ఎటువంటి కేసునమోదు కాలేదు. అయితే ఈ ఘటనపై పోలీసు కేసు నమోదుకాకపోవటం గమనార్హం. స్కూల్ యాజమాన్యం, కుటుంబ సభ్యుల మధ్య ఆర్థిక ఒప్పందం కుదరటంతో ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. కాగా విద్యార్థి మృతి విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి పోలీసులు వచ్చే లోపే మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామమైన నందమూరుకు తీసుకువెళ్ళారు. పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు మృతదేహాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.