కృష్ణ

ఆగ్రహించిన అంగన్‌వాడీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 23: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్‌వాడీలు ఆగ్రహించారు. సమస్యల పరిష్కారం కోసం కదం తొక్కారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. సీఐటీయు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనకు జిల్లా నలుమూలల నుండి వేలాది మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు తరలి వచ్చారు. సమస్యలపై ఏకరువు పెట్టారు. కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని, బయోమెట్రిక్ మిషన్లను అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని, నెల రోజులు వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలను ఎండగట్టారు. వాడి వేడి ప్రసంగాలతో ఉద్యమాన్ని మరింత వేడెక్కించారు. ప్రసంగాల అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన అంగన్‌వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. మూసి వేసి ఉన్న కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎక్కిన అంగన్‌వాడీలు సమస్యల పరిష్కారంపై సమాధానం చెప్పేందుకు కలెక్టర్ బయటకు రావాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తాము విశ్రమించేది లేదంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ దశలో ఏం చేయాలో తెలియని పోలీసులు ‘మీకోసం’ కార్యక్రమానికి హాజరైన జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్‌కు సమాచారం ఇచ్చారు. ఆమె సూచనల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి బిఆర్ అంబేద్కర్ ఆందోళనకారుల వద్దకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే డీఆర్‌ఓ రాకను అంగన్‌వాడీలు ఏ మాత్రం అంగీకరించలేదు. కలెక్టర్ మాత్రమే వచ్చి తమ సమస్యలపై సమాధానం చెప్పాలని పట్టుపట్టారు. దీంతో పోలీసులు అరెస్టులకు సిద్ధమయ్యారు. పోలీసుల చర్యలను అంగన్‌వాడీలు ప్రతిఘటించారు. పోలీసులను ఏ మాత్రం లెక్క చేయకుండా కలెక్టరేట్ ముట్టడికి తీవ్రంగా శ్రమించారు. ఈ దశలో పోలీసులు, అంగన్‌వాడీల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం, తోపులాట జరిగింది. పోరాట పటిమను ప్రదర్శిస్తున్న కొంత మంది ముఖ్యమైన ఉద్యమకారులను పోలీసులు టార్గెట్ చేశారు. రోప్ పార్టీ సాయంతో అంగన్‌వాడీలను కట్టడి చేస్తూ ఆందోళనకు నాయకత్వం వహించిన నాయకులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని పోలీసుల వాహనాల్లో పోలీసు స్టేషన్‌కు తరలించే ప్రయత్నాలను కూడా అంగన్‌వాడీలు తీవ్రంగా అడ్డుకున్నారు. పోలీసు వాహనాలను ఎటూ కదలనివ్వకుండా అడ్డుపడ్డారు. కొంత మందైతే వాహనాలకు అడ్డంగా పడుకున్నా పోలీసులు మాత్రం అంగన్‌వాడీలను చెల్లాచెదురు చేసి అరెస్టు చేసిన వారిని చిలకలపూడి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ చిలకలపూడి పోలీసు స్టేషన్ వద్ద కూడా అంగన్‌వాడీలు ధర్నా చేశారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రజీనారాణి, సిహెచ్ సుప్రజ, సీఐటీయు తూర్పు కృష్ణా ప్రధాన కార్యదర్శి వై నరసింహరావు, బందరు డివిజన్ కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం, ఆశ కార్యకర్తల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ కమల తదితరులు ఆందోళనకు నాయకత్వం వహించారు.
చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తా : ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు
అంగన్‌వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తానని శాసనమండలి సభ్యుడు బొడ్డు నాగేశ్వరరావు అన్నారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన అంగన్‌వాడీల ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అంగన్‌వాడీలతో వెట్టి చాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించడంలో మీన మేషాలు లెక్కిస్తోందన్నారు. అంగన్‌వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారానికి తాను అండగా నిలుస్తానన్నారు. అంగన్‌వాడీలు నిర్వహించే ఎటువంటి ఉద్యమానికైనా సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు.