క్రైమ్/లీగల్

కొడుకు కొట్టిన దెబ్బలకు తండ్రి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు, మే 28: గ్రామ పెద్దల్లో జరిగిన ఘర్షణలో కొడుకు తండ్రిపై దాడికి పాల్పడ్డాడు. గాయపడిన తండ్రి వారం రోజుల తరువాత సోమవారం మృతి చెందాడు. దీనిపై కైకలూరు రూరల్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం వడ్లకూటితిప్పకు చెందిన బలే వెంకన్న (50)కు, అతని కుమారుడు నాగరాజుల మధ్య ఈ నెల 21వ తేదీన పెద్దల సమక్షంలో స్వల్ప వివాదం తలెత్తింది. వెంకన్న మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతుంటే భార్య సుబ్బమ్మ, కొడుకు నాగరాజు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. విచారిస్తుండగా కోపోద్రిక్తుడైన వెంకన్న భార్య, కొడుకును, పెద్దలను దూషించి ఎదురు తిరిగాడు. ఈ నేపథ్యంలో నాగరాజు ఆగ్రహించి పక్కనే ఉన్న ఇటుక రాయితో తండ్రి తలపై కొట్టాడు. గాయపడ్డ వెంకన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

పోలీసు జీపు ఢీకొని ముగ్గురికి గాయాలు
పెనమలూరు, మే 28: మండలంలోని కానూరు పప్పుల మిల్లు వద్ద యాక్టివాను పోలీసు జీపు ఢీకొన్న సంఘటన సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కర్రి బాలశంకర్, హిమ జ్యోతి, కార్తికేయ విజయవాడ వెళుతూ మార్గమధ్యలో పప్పుల మిల్లు వద్ద తమ యాక్టివాను పోలీసు జీపు ఢీకొనంతో ప్రమాదం జరిగింది. ముగ్గురు కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారు. టైమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ దుర్గమహేష్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దుర్గమహేష్ తెలిపారు.