కృష్ణ

‘నవరత్నాల’తో నవశకానికి నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ‘నవరత్నాల’తో నవశకానికి నాంది పలకబోతున్నట్టు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రభుత్వ మాజీ విప్ పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. రావాలి జగన్ కావాలి జగన్ నినాదంతో వైఎస్‌ఆర్ సీపీ అధినేత జగన్మోహనరెడ్డి ప్రకటించిన ‘నవరత్నాలు’లను ప్రతి గడపలోకి తీసుకువెళ్లేందుకు గాను వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో గడప గడపకీ వైసీపీ కార్యక్రమానికి మండల పరిధిలోని సిరివేళ్లపాలెం గ్రామంలో సోమవారం శ్రీకారం చుట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పేర్ని నాని గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ప్రతి ఇంటికీ వెళ్లి నవరత్నాల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. అంతేకాకుండా స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడిచిన నాలుగేళ్లుగా ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పారబడుతూ ఆయన పర్యటన సాగింది. అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అన్ని వర్గాల ప్రజలు రాజన్న రాజ్యాన్ని కోరుకుంటున్నారన్నారు. అటువంటి రాజ్యస్థాపన ఒక్క జగన్మోహనరెడ్డికే సాధ్యమన్నారు. మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గద్దె దిగే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు షేక్ సలార్ దాదా, బొర్రా విఠల్, మోకా భాస్కరరావు, మాదివాడ రాము, శొంఠి ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.