క్రైమ్/లీగల్
అనుమానాస్పద స్థితిలో యువకుని మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 4 October 2018
కంకిపాడు, అక్టోబర్ 3: పదిరోజుల క్రితం అదృశ్యమైన ఓ యువకుడు కాలువలో శవమై తేలాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం కంకిపాడు చెందిన వంగా వంశీ(23) గత నెల 24న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. అతని తల్లి రాజేశ్వరి పోలీసులను ఆశ్రయించింది. ఈమేరకు ఈ నెల 2న అదృశ్యం కేసు నమోదైంది. బుధవారం ఉదయం ఘంటసాల సమీపంలోని పంట కాలువలో వంశీ మృతదేహం లభ్యమైనట్లు బాధిత కుటుంబ సభ్యులు సమాచారం అందుకున్నారు. వంశీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసును మార్పు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.