క్రైమ్/లీగల్

అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముసునూరు, నవంబర్ 11: మండలంలోని కాట్రేనిపాడులో అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాట్రేనిపాడు గ్రామ శివారు రాజీవ్‌నగర్‌కు చెందిన ఎం శివరామకృష్ణ (32)తో నాగమల్లేశ్వరి(25)తో 3 నెలల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో నాగమల్లేశ్వరి తన మామతో కలిసి గన్నవరం మండలం పొట్టిపాడులో ఉంటున్న తన మరిది కిషోర్ ఇంటికి శనివారం వెళ్ళిందని, అక్కడ ఏమి జరిగిందో తెలియదు కాని నాగమల్లేశ్వరి పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో ఉండగా మరిది గమనించి ఆసుపత్రికి చికిత్స నిమిత్తమై తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందిందని, మృతి చెందిన నాగమల్లేశ్వరిని మరిది, బంధువులు శనివారం రాత్రి 11 గంటలకు రాజీవ్‌నగర్‌లోని శివరామకృష్ణ ఇంటికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న శివరామకృష్ణ తీవ్ర మనస్థాపానికి గురై ఇంటిలోని దూలానికి ఉరి వేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కెవిజివి సత్యనారాయణ కేసు నమోదు చేయగా ఆదివారం సీఐ రామ్‌కుమార్ సంఘటన స్థలికి వెళ్ళి మృతదేహాలను పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.