కృష్ణ

జీఎన్‌రావు కమిటీ బోగస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు: ప్రజా రాజధాని అమరావతిని మార్చాలని నివేదికలు ఇచ్చిన జీఎన్‌రావు కమిటీ బోగస్ కమిటీ అని మాజీ జడ్పీచైర్‌పర్సన్ గద్దె అనురాధ పేర్కొన్నారు. మండలంలోని పెనమకూరులో శనివారం అమరావతి రాజధానిగానే కొనసాగించాలని కోరుతూ మండల టిడిపి నాయకులు నిర్వహించిన దీక్షను అనురాధ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరావతి రాజధాని కోసం 33వేల ఎకరాల భూమి ఇచ్చిన రైతులు నిరసన దీక్షలు చేస్తుంటే పోలీసులు అనుమానుషంగా ప్రవర్తించటం దారుణమని అన్నారు. అమరావతిని మార్చితే మనకన్ను మనమే పోడుచుకున్నట్లేనని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

మహిళా సంరక్షణ కార్యదర్శులకు నియామక ఉత్తర్వులు అందజేత
మచిలీపట్నం (కోనేరుసెంటర్), జనవరి 18: గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 51 మంది మహిళా సంరక్షణ కార్యదర్శి అభ్యర్థులకు శనివారం నియామక ఉత్తర్వులను అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.