కరీంనగర్

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగుండం, మార్చి 29: మధ్యతరగతి కుటుంబాల్లో క్షణికావేశంలో పెనవేసుకొనే అక్రమ సంబంధాలు గొడవలను సృష్టించడమే కాకుండా, ఏకంగా ప్రాణాలు బలితీసుకునేలా చేస్తున్నాయి. గుట్టుగా కొనసాగే కుటుంబాలను ఇలాంటి ఘటనలతో రోడ్డున పడేలా చేస్తున్నాయి. రామగుండం- రాఘవపూర్ రైల్వేస్టేషన్ మధ్య రైలు పట్టాలపై వదిన, మరిది ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముత్తారం మండలం లద్నాపూర్‌కు చెందిన రామిండ్ల కుమార్(40), ఇర్ల మధునమ్మ(35) అనే వదిన, మరిదిలు ఇద్దరు మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియన రైలు కింద పడి ఆత్మహత్యకు ఒడికట్టారు. 279మైలు రాయి వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రామగుండం జిఆర్పీ అవుట్ ఫోస్ట్ ఇన్‌చార్జి బహీరొద్దిన్ కథనం ప్రకారం.. ముత్తారం మండలం లధ్నాపూర్ గ్రామానికి చెందిన రామిండ్ల కుమార్ ఓసీపీ-2లో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతని భార్య తరువు బంధువు ఆడపడుచు ఈర్ల మధునమ్మ ఇదే గ్రామానికి చెందినది. వీరి ఇద్దరి మధ్య కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈ నెల 26వ తేదీన వీరు ఇద్దరు వేరు వేరు కారణాలతో ఇంటి నుండి బయటికి వచ్చారు. అయితే మంగళవారం తెల్లవారు జామున వదిన, మరిది ఇద్దరు రాఘవపూర్-రామగుండం ట్రాక్‌లైన్ల మధ్య రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా జి ఆర్పీ పోలీసులు పేర్కొన్నారు. రైల్వే ట్రాక్ లైన్‌కు సమీపంలో టివి ఎస్ ఛాంఫ్ ద్విచక్రవాహనం పడి ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యప్తు జరుపుతున్నట్లు బషిరొద్ధిన్ తెలిపారు.
లద్నాపూర్‌లో విషాదం..
ముత్తారం మండలం లద్నాపూర్‌కు చెందిన రామిండ్ల కుమార్, ఇర్ల మధునమ్మ అనే ఇద్దరు రైల్వేట్రాక్ లైన్‌పై ఆత్మహత్యకు పాల్పడడంతో లద్నాపూర్‌లో విషాదం నెలకొంది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, ఒకే కుటుంబానికి చెందిన వారు ఆత్మహత్యకు ఒడికట్టడంతో ఈ రెండు కుటుంబాల మధ్య విషాదం అలుముకుంది.