కరీంనగర్

ఎగువ మానేరు జలాశయానికి జనజాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంభీరావుపేట, సెప్టెంబర్ 26: ఎగిసిపడుతున్న ఎగువ మానేరు జలాశయాని కి సోమవారం జనజాతర సంచరించుకుంది. రెండేళ్ల విరామ అనంతరం గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతుండడం తో పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రాజెక్టును తిలకిస్తున్నారు. 32 అడుగుల ఎత్తున్న ప్రాజెక్టు మూడు రోజుల్లోనే పూర్తిస్థాయిలో నిండి పొంగిపోర్లుతుంది. భారీగా వరదనీరు ప్రధాన రహదారిపై పొంగి ప్రవహిస్తుండంతో కామారెడ్డి-సిద్దిపేటకు మూడు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున ఆయకట్టు రైతులు, ప్రజలు తరలివచ్చి మానేరు వీక్షిస్తుండడం ప్రా జెక్టు తీరాన జాతర సందడి నెలకొనివుంది. వచ్చే పర్యాటకులకై ప్రాజెక్టు పరిసరాల్లో పలు చిరు దుకాణాలు వెలిశాయి.