కరీంనగర్

గుంజపడుగులో హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొల్లపల్లి, మార్చి 31: మండలంలోని గుంజపడుగులో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పత్రి సంతోష్ (20) అనే యువకున్ని హత్య చేసిన సంఘటన మండలంలో సంచలనం రేపింది. పెంబట్ల గ్రామానికి చెందిన పత్రి సంతోష్ గత 2సంవత్సరాలుగా గుంజపడుగులోని అక్క సౌందర్య ఇంట్లో ఉంటున్నాడు. బావ అంజయ్యతో పత్తికొనుగోలు చేస్తుంటాడు. బుధవారం మేడిపల్లిలో బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చాడు. రాత్రి 8గంటల కు వెళ్లిన సంతోష్ తిరిగి రాలేదు. ఉదయం గ్రామ సమీపంలోని కల్వర్టు వద్ద శవమై కనిపించాడు. మృతదేహం వద్ద రక్తం మరకులు లేకపోగా ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసిన కోణంలో పోలీసులు విచారణ చేస్తూ, నిందితుల కోసం జాగిలాలతో విచారణ చేస్తున్నారు. ఎస్సై రమేష్ కేసు నమోదు చేయగా సిఐ వెంకటరమణ దర్యాప్తు చేస్తున్నారు.