కరీంనగర్

అన్నం పెట్టనందుకే హతం చేశా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయికల్, మార్చి 31: అన్నం పెట్టమని అడిగితే పెట్టనందుకే కోపంతో గొడ్డలితో నరికి హత్య చేసిన నిందితున్ని గురువారం కోరుట్ల సిఐ రాజశేఖరరాజు అరెస్టు చేశారు. సిఐ కథనం ప్రకారం ఈనెల 28న రాత్రి ఇటిక్యాల శివారులో సురకంటి రఘుపతిరెడ్డి (45)ను దారుణంగా హత్య చేసిన మేడిపల్లి మండలం పోరుమల్లకు చెందిన అరకొండ శేఖర్ (25)ను అరెస్టు చేశారు. రాయికల్ ఠాణాలో సిఐ రాజశేఖరరాజు మాట్లాడుతూ ఎలాంటి క్లూలేకున్నప్పటికీ 2రోజుల్లో హత్య మిస్టరీ చేధించిన రాయికల్, మల్లాపూర్ ఎస్సైల అభినందించారు. పోరుమల్లకు చెందిన శేఖర్ ఇంట్లో గొడవపెట్టుకొని ఇటిక్యాల తన సోదరి ఇంట్లో కొంతకాలంగా ఉంటూ సైకోగా మారిన అతను రోడ్డుపైకి వస్తున్న వారినికూడా భయభ్రాంతులకు గురి చేసేవారు 2రోజుల క్రితం బైక్‌పై వెళ్తున్న దంపతులను బెదిరించడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఇటిక్యాల శివారులో అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా ఈ హత్య తానే చేసినట్లు ఒప్పుకోవడంతో పాటు హత్య స్థలానికి పోలీసులను తీసుకెళ్లారు. ఈ క్రమంలో నిందితున్ని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపర్చినట్లు సిఐ తెలిపారు. ఈ సమావేశంలో రాయికల్, మల్లాపూర్ ఎస్సైలు తిర్మల్‌గౌడ్, జానీపాషా, ట్రైనీ ఎస్సై శేఖర్‌లున్నారు.