కరీంనగర్

ఓర్వలేకనే ఆరోపణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుస్నాబాద్, ఏప్రిల్ 27: అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో చేయలేని అభివృద్ధిని టిఅర్‌ఎస్ ప్రభుత్వం మూడేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించిందని, దీన్ని ఓర్వలేని కొన్ని పార్టీలు విమర్శింసిస్తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. టిఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు ట్రాక్టర్లతో ర్యాలీతో బుధవారం హుస్నాబాద్‌కు చేరి రాత్రి పట్టణంలో తిరుమల గార్డెన్‌లో బస చేశారు. గురువారం ఉదయం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వరంగల్ ప్లీనరీకి బయలుదేరే ముందు ఆయన హుస్నాబాద్‌లో స్థానిక నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు చేయుతనిచ్చె విధంగా అనే సంక్షేమ పథకాలను రైతులకు ఎకరాన 4వేల నగదును ఇచ్చేందుకు కెసిఅర్ ప్రకటించడం దేశంలోనే ఎక్కడ లేని సాహసోపేత నిర్ణయమని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాయిరెడ్డి రాజారెడ్డి, నగర పంచాయితీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, ఎంపిపి భూక్య మంగ, టిఅర్‌ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షడు తిరుపతిరెడ్డి, మాజీ జడ్పీటిసీ బీలునాయక్, తదితరులు పాల్గొన్నారు.