కరీంనగర్

తిప్పాపూర్ ఘటనకు సర్కారుదే బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లంతకుంట, సెప్టెంబర్ 21: కాళేశ్వరం ప్రాజెక్టులో తిప్పాపూర్‌లో 10వ ప్యాకేజిలో పనులను నిబంధనలకు విరుద్ధంగా చేపట్టి, పలువురు కూలీల మరణానికి బాధ్యులైన వారిని శిక్షించాలని రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్ డిమాండ్ చేశారు. సొరంగంలోప్రమాద ఘటన స్థలాన్ని గురువారం ఆయన పరిశీలిచాక విలేఖరులతో మాట్లాడుతూ, ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు వెంటనే 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. వెంటనే శవ పరీక్షలు జరిపించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా రైతు సెల్ అధ్యక్షుడు పాశం రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు ఆకుల సత్యం, శ్రీనివాస్, మండల నాయకులు కేశవ రెడ్డి తదితరులు ఉన్నారు.