కరీంనగర్
వడదెబ్బతో దర్జి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 9 April 2016
కమలాపూర్, ఏప్రిల్ 8: కరీంనగర్ జిల్లా మండల కేంద్రమైన కమలాపూర్కు చెందిన కులూరి సారయ్య (65) అనే దర్జి గురువారం అర్ధరాత్రి వడదెబ్బకు అస్వస్థతకు గురై మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. సారయ్య దర్జి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇదే క్రమంలో డబ్బాలో దర్జి పని చేసుకుంటుండగా ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై గురువారం అర్ధరాత్రి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతునికి కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.