కరీంనగర్

సుల్తాన్‌పూర్‌లో ఆర్టీసీ బస్ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలపల్లి, డిసెంబర్ 14: ఎలిగేడ్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామ శివారులో గురువారం కరీంనగర్ డిపో ఆర్టీసీ బస్ బోల్తా పండింది. దాదాపు 30 మందికి గాయాలయ్యాయి. ఏపీ 28 జడ్ 4491 అనే నంబర్ బస్ కరీంనగర్ నుండి పెద్దపల్లి వయా సుల్తాన్‌పూర్, కాచాపూర్ లమిదుగా వెళ్ళి తిరిగి కరీంనగర్ వెళుతూండగా డ్రైవర్ అజాగ్రత్తగా , అతివేగంగా నడపడంతో రొడ్డు పక్కనున్న వ్యవసాయ భూమిలో బోల్తా పడింది. అందులో 50 మందికి పైగా ప్రయాణికులుండగా 30 మందికి తీవ్ర గాయలయ్యాయి. డ్రైవర్ సంఘటన స్థలం నుంచి వెళ్ళిపోయాడు. సంఘటన స్థలానికి సుల్తానాబాద్ సిఐ రాములు, జూలపల్లి, ఎస్సై దేవేందర్, తహశీల్దార్ సురేష్, ఎంపీడీ ఓ వేణుగోపాల్‌రావులు సకాలంలో చేరుకుని క్షతగాత్రులను 108, కార్లు, ఆటోల ద్వారా కరీంనగర్, సుల్తానాబాద్ ఆసుపత్రులకు తరలించారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చేరుకుని ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. పెద్దపల్లి డీసీపీ విజేందర్‌రెడ్డి, ఏసీపీ హబీబ్‌ఖాన్, కరీంనగర్ డిపో మేనేజర్ లక్ష్మాధర్మ, ఆర్‌ఎం చంద్రకాంత్, డీవీఎం రవిలు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.