కరీంనగర్

మహనీయుడా.. మన్నించు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 14: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను అనుసరించాలని పాలకులు, అధికారులు ప్రసంగాలతో ఊదరగొట్టారు. అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను ఎల్లారెడ్డిపేట మండలంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పూలమాలలతో అభిమానాన్ని ముంచేత్తారు. వేడుకలను పోటాపోటిగా జరిపారు. మండలంలోని వీర్నపల్లి, గర్జనపల్లి, వన్‌పల్లి గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలను నెలకొల్పి ఏళ్లు గడుస్తున్నా పాలకులు, అధికారులు, అంబేద్కర్ యువజన సంఘాలు పట్టించుకోకపోవడంతో ముసుగు తొలగడం లేదు. గర్జనపల్లిలో విగ్రహం ఓ చెట్టు నీడన ఉండడంపై పలువురు భారత రాజ్యాంగ నిర్మాతకు ఇదేనా గౌరవం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహానీయుడా మన్నించు అని మిన్నకుండిపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు, అంబేద్కర్ సంఘాలు ముందుకు వచ్చి ముసుగు తొలగిస్తే జాతికి దిశ నిర్ధేశం చేసిన అంబేద్కర్‌కు గౌరవం దక్కుతుందని ఆ గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.