కరీంనగర్

రోడ్డు ప్రమాదంలో అత్తాకోడలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమాన్‌పూర్, జనవరి 18: కమాన్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సిద్ధిపల్లె వాసులు బసంతనగర్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా సిద్ధిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే... సిద్ధిపల్లెకు చెందిన జాబు సరోజన అలియాస్ లక్ష్మి (అత్త), జాబు నిర్మల (కోడలు) తమ బంధువుల గ్రామంలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా రాజీవ్ రహాదారి బసంతనగర్ వద్ద ఆటోను లారీ ఢీకొట్టగా అత్త కోడలు మృతి చెందారు. దీంతో గురువారం పోస్టుమార్టమ్ అనంతరం వారి శవాలను కమాన్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సిద్ధిపల్లెకు తరలించారు. ఒకేసారి రెండు మృతదేహాలు ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. కాగా సిద్ధిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరి అంత్యక్రియల్లో జడ్పిటిసి మేకల సంపత్ యాదవ్, వైస్ ఎంపిపి కొట్టె భూమయ్య, నాయకులు రామారావు, కిషన్ రెడ్డి, లక్ష్మిమల్లు, శంకర్ పాల్గొన్నారు.