క్రైమ్/లీగల్

అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాపూర్, మార్చి 4: మండలంలోని ఘనపూర్ గ్రామానికి చెందిన తిప్పారపు బాలమ్మ (47) అనే మహిళ రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సైదాపూర్ ఎస్‌ఐ నూతి శ్రీ్ధర్ తెలిపిన ప్రకారం..తనకున్న ఎకరంన్నర భూమితో పాటు మరో ఎకరమున్నర కౌలుకు తీసుకొని పత్తి, వరి సాగు చేసుకుంటోంది. గత మూడు సంవత్సరాల నుండి ఆశించిన దిగుబడి రాకపోవడంతో దాదాపు మూడు లక్షల రూపాయలు అప్పులైనట్లు ఆయన తెలిపారు. అప్పులు ఎలా తీర్చాలోనని మనస్థాపానికి గురై శనివారం మధ్యాహ్నం భర్త కూలీకి వెళ్లి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాగా, తన భార్య బాలమ్మ ఇంటిలో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఇంటి ముందు పడి ఉంది. భర్త, స్థానికులు 108 వాహనం ద్వారా హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజిఎంకు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. మృతురాలి భర్త దుర్గయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీ్ధర్ తెలిపారు.