క్రైమ్/లీగల్

కొడుకు చేతిలో తండ్రి హత్య తాగిన మత్తులో ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, మార్చి 20: మద్యం తాగిన మత్తులో జరిగిన ఘర్షణ చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుచిది. క్షణికావేశంతో కని పెంచిన కొడుకే ఇనుప రాడుతో తలపై కొట్టి తండ్రిని హతమార్చిన ఉదంతమిది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా రాగినేడు గ్రామానికి చెందిన మాటేటి శ్రీనివాస్ (45) అనే వ్యక్తి అతని కుమారుడు మాటేటి శేఖర్ (20) చేతిలో సోమవారం రాత్రి సుమారు 10-30 గంటల సమయంలో హత్యకు గురయ్యాడు. తండ్రి తాగి వచ్చి గొడవ చేస్తుండటంతో అప్పటికే తాగి ఉన్న కుమారుడు శేఖర్ అతనితో ఘర్షణకు దిగాడు. ఈ నేపథ్యంలో మాటామాటా పెరగడంతో ఆగ్రహంతో బైక్ రాడుతో శేఖర్ తండ్రి తలపై బాధడంతో తీవ్ర రక్త స్రావం జరిగి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతాయని, సోమవారం రాత్రి శేఖర్ క్షణికావేశానికి గురై రాడుతో కొట్టడం వల్ల అతని చేతిలో తండ్రి హతమయ్యాడని గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు మృతుడు సోదరుడు మాటేటి కనుకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్సై జగదీష్ తెలిపారు.